రేణిగుంట జులై 20.
ఈ రోజు రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రయాణికుడు పొరపాటున మర్చిపోయిన బ్యాగును రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో మూడు మొబైల్ ఫోన్లు (ఒక ఐఫోన్ , రెండు వన్ ప్లస్ మొబైల్ ఫోన్లు) మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.
పోలీసులు వెంటనే బ్యాగు యజమానిని గుర్తించి, అందులోని వస్తువులను పరిశీలించి, పూర్తి ధృవీకరణ అనంతరం బ్యాగుతో పాటు మూడు మొబైల్ ఫోన్లను బాధితుడికి భద్రంగా అప్పగించారు.
ఈ సందర్భంగా బాధితుడు రేణిగుంట పోలీసుల నిజాయితీ, అప్రమత్తత మరియు సత్వర స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.
