
రేణిగుంట జూలై 15 : .
తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఘన స్వాగతం లభించింది.
విమానాశ్రయం వద్ద ఆయనకు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, మర్యాదపూర్వక పర్యవేక్షణ ఉప కలెక్టర్ (ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్) శివ శంకర్ నాయక్, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు.