
జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28 కురుపాం నియోజకవర్గ పరిధిలోని కొమరాడ మండలం విక్రంపురం గ్రామ పంచాయితీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను స్థానిక ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు పరిశీలించారు. గ్రామంలోని మామిడి వీధిలో జరుగుతున్న ఈ ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బి ఎల్ ఓ అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను నమోదు చేస్తున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు తన చేతుల మీదుగా ఒక ఓటరుకు స్వయంగా ఓటరు పారాలు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా రక్షకభటులు, పర్యవేక్షకులతో ఆయన మాట్లాడారు.
ఓటరు సవరణ ప్రక్రియను పూర్తి నిబంధనల ప్రకారం, పారదర్శకంగా చేపట్టాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓటర్లందరికీ స్పష్టంగా తెలియజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
ఈ కార్యక్రమంలో బిఎల్ఓ మహిళ పోలీస్, బిఎల్ఎ మధు పాల్గొన్నారు