తిరుపతి జూన్ 5.
తిరుపతిలో
డాక్టర్ బాలకృష్ణ నాయక్ డి ఎం అండ్ హెచ్ ఓ తిరుపతి, మరియు డాక్టర్ పి. శైలజ, జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీబీ అధికారి తిరుపతి లోని అనంత సేన మరియు జ్యోతి లెప్రసీ కాలనీల నందు అర్హులైన కుష్టు వ్యాధి ద్వారా అంగవైకల్యం పొందిన వారికి వాకింగ్ ఫ్రేమ్స్, చేతి కర్రలు, ప్రత్యేకంగా తయారుచేసిన మైక్రో సెల్యులార్ రబ్బరు ఎం సి ఆర్ తో తయారు చేసిన పాదరక్షలు మరియు అవసరమైన డ్రెస్సింగ్ మెటీరియల్స్ అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి ద్వారా అంగవైకల్యం పొందినవారు ప్రతిరోజు అరికాళ్ళు మరియు అరిచేతులను నీటిలో నానబెట్టి శుభ్రపరచుకొని తర్వాత వేప నూనె పూసుకోవాలని, పుండ్లు ఉంటే డ్రెస్సింగ్ చేసుకోవాలని మరియు తీసుకోవాల్సిన స్వీయ జాగ్రత్తలను తెలియజేశారు మరియు వారికి రావాల్సిన అంగవైకల్య పెన్షన్లు వస్తున్నాయా లేదా అని విచారించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, డిఎన్ఎమ్ఓ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రాజేష్, డాక్టర్ వసుధ, ఆరోగ్య విస్తరణ అధికారి బాబు నెహ్రూ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ శ్రీరాములు నాయక్, డిపిఎంవోలు ముని సుబ్బరామిరెడ్డి, సుధాకర్ నాయక్ మరియు స్వచ్ఛంద కార్యకర్త రమణ మొదలగు వారు పాల్గొన్నారు


