తిరుపతి, జూన్ 05 : రెండు రోజులు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి విమానాశ్రయం నందు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్
డా,, ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు, కాళహస్తి ఆర్ డి ఓ బానుప్రకాష్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి కి సాదర వీడ్కోలు పలికిన వారిలో వున్నారు.
