
మన ద్యాసా ప్రతినిధి విశాఖపట్నం ఆశీల్ మెట్ట జూన్ 3 :వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నిలిస్తే.*పేకాట ఆడేవారికి డీఎస్సీలో లోకేష్ ఉద్యోగం ఇవ్వడం.తన శస్త్రచికిత్స కోసం పవన్ కల్యాణ్ తెలంగాణ పరుగులు తీయడం చూస్తుంటే.రాష్ట్రంఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోందని మాజీ ఎమ్మెల్యే. వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఎద్దేవా చేశారు.వెన్నుపోటుకు రెండేళ్లు.. పేరిట పార్టీ అదిష్టానం రూపొందించిన పోస్టర్ ను ఆశీల్ మెట్ట కార్యాలయంలో పార్టీ క్రిష్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యకుడు జాన్ వెస్లీ,ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా జానకీరామ్ తో పాటు పార్టీ దక్షిణ శ్రేణులతో కలిసి వాసుపల్లి పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ ఇస్తానని మోసపూరిత వాగ్ధానాలు.మేనిఫెస్టోలో పొందుపరచిన చంద్రబాబు అండ్ కూటమి గ్యాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక దిక్కులు చూడడం మొదలెట్టారని ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు చివరకు తల్లికి వందనం సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు.ఆడబిడ్డ నిది కూడా ఆటకెక్కిందన్నారు.50 ఏళ్లకు పింఛన్ అని అది కూడా పడకేసిందన్నారు.విద్యా,వైద్యాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.చంద్రబాబు ప్రభుత్వలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమయ్యారంటేప్రస్తుత కూటమి పాలన పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందని చెప్పారు.వైద్య వ్యవస్థ బలోపేతానికి 53 వేల పోస్టులు జగన్మోహన్రెడ్డి పూరించారని, కేవలం 16 వేల పోస్టులు భర్తీ చేసి కూటమి ప్రభుత్వం సంకలు గుద్దుకుంటుందని మంత్రి లోకేష్ నుద్దేశించి మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్టు వస్తుందని, విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయ్యోద్దన్నారు.విశాఖ,భోగాపురం రెండు ఎయిర్పోర్టులు ఆపరేట్ చెయ్యాలన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైసిపి మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి రావడం తధ్యమని జోష్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బిపిన్ జైన్,వార్డ్ ప్రెసిడెంట్ ,నీలపు సర్వేశ్వరరెడ్డి,పీతల వాసు,దొడ్డి బాపూఆనంద్,పిన్నింట్ల రాజారెడ్డి,మహమ్మద్ షకిల్, గురజారపు రవి,భీశెట్టి ప్రసాద్,మాజీ కోఆప్షన్ మెంబెర్ షరీఫ్,జిల్లా వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు,జిల్లా సెక్రటరీ అభిరెడ్డి ఆది విష్ణు రెడ్డి,పద్మనాభం అమ్మాజీ, స్టేట్ బీసీ నాయకులు లండ రమణ,స్టేట్ నాయకులు దస్మంతుల చిన్ని, షబీర బేగం,జిల్లా ప్రెసిడెంట్ సనపల రవీంద్ర,ప్రసాద్,జిల్లా అనుబంధ సంఘాల,సౌత్ అనుబంధ సంఘాల,వార్డ్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.