ఏర్పేడు:
ఏర్పేడు మండలం పాతవీరపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ద్రౌపదీ దేవి తిరునాళ్ళ (బ్రహ్మోత్సవాలు) వేడుకల్లో మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గ్రామానికి విచ్చేసిన ఎమ్మల్యే కి ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు , ప్రముఖ నాయకులు బత్తల నాయుడు మరియు పాతవీరపురం గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా, ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ద్రౌపదీ దేవి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తిరునాళ్ళకు విచ్చేసిన భక్తులతో ఆయన కాసేపు ముచ్చటించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మల్యే మాట్లాడుతూ... పాతవీరపురం గ్రామ ప్రజల ఆత్మీయత తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. "పాతవీరపురం గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. గ్రామంలోని మౌలిక వసతుల కల్పనకు, రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను" అని ఆయన గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
"ప్రజల కష్టాల్లో తోడుంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే మా లక్ష్యం."
— శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో పాతవీరపురం గ్రామ పెద్దలు, మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరునాళ్ళను జయప్రదం చేశారు. ఎమ్మల్యే రాకతో పాతవీరపురం గ్రామంలో పండగ వాతావరణం మరింత రెట్టింపయింది


