రేణిగుంట, మే 26:
సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కాంగో వంటి దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశీ ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతుండటంతో, వైరస్ జిల్లాలోకి ప్రవేశించకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు రేణిగుంట వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి వెల్లడించారు.
విదేశీ ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు రేణిగుంట ఎయిర్పోర్ట్ అథారిటీతో వైద్యశాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్ట్ లో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే, తక్షణమే వారిని తిరుపతి స్విమ్స్ ఐసోలేషన్ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ తరహాలోనే అనుమానితుల నుండి ముక్కు మరియు గొంతు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తారు.
ఎబోలా వైరస్ బాధితుల శరీర ద్రవాలు, దగ్గు మరియు తుమ్ముల తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని డాక్టర్ చక్రపాణి వివరించారు. ఈ వ్యాధి సోకిన వారిలో ప్రధానంగా ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:
ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరారు. ప్రయాణాల్లో మరియు రద్దీ ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులను లేదా ఆరోగ్య శాఖను సంప్రదించాలని రేణిగుంట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చక్రపాణి స్పష్టం
