
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం( గాజువాక)మే24:

72వ వార్డు లో ఉడా కాలనీ వినాయక నగర్ ఓం శాంతి సెంటర్ లో 21,22,23 తేదీలలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పిల్లలకి మైండ్ గేమ్స్, పాటల పోటీలు,డాన్స్ పోటీలు,డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ క్రీడాకారుని హైకోర్టు న్యాయవాది గాజువాక బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి అండి బోయిన లక్ష్మి జిల్లా యాత విభాగ అధ్యక్షులు అండి బోయిన అప్పారావు పాల్గొని పిల్లలకు బహుమతులు ప్రధానంచేశారు.
ముఖ్య అతిథి గాజువాక బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి అండి బోయిన లక్ష్మీ మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలకు ఓం శాంతి విశ్వ విద్యాలయం వారు ఈ సమ్మర్ క్యాంపులో పిల్లలకు పాటల,పోటీలు,డాన్స్ పోటీలు,డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వాళ్లలో ఆలోచన శక్తి ఆత్మవిశ్వాసం పెంపొందించారు. విద్యార్థులకు మెడిటేషన్ చేయించి దైవభక్తి నేర్పించి మంచి మార్గం వైపు పిల్లలు నడిచే విధంగా తయారు చేస్తున్నారన్నారు. పిల్లలందరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని మంచి మార్గంలో నడవాలని ఆటల్లో పాటల్లో ముందుండి వాళ్ళ ప్రతిభను చాటుకోవాలని ఆరోగ్యంగా ఆనందంగా వారి జీవన శైలి పెంపొందించుకోవాలని ఆశీర్వదించారు.పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో నూకరాజు,ఓం శాంతి అక్కయ్యలు,శాంతి అనురాధ, పిల్లలు పేరెంట్స్ ఓం శాంతి అక్కయ్యలు పాల్గొన్నారు.