ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 12, 2026, 3:12 pm
హనుమాన్ జయంతి సందర్భంగా జపాలి తీర్థంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం తిరుమల శేషాచల అడవుల్లో కొలువై ఉన్న అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన శ్రీ జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చైర్మన్ కి హథీరాంజీ మఠం మహంత్ అర్జున్ దాస్ జీ మరియు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయ అర్చకులు శివనారాయణ, వేణుగోపాల్ ఆధ్వర్యంలో చైర్మన్ కి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల తో చైర్మన్ కి ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:హనుమత్ జన్మస్థలమైన అంజనాద్రి పై వెలసిన జపాలి దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు.
హనుమంతుడిని హనుమాన్ జయంతి వేళ భక్తులందరికీ ఆ హనుమంతుడి ఆశీస్సులు లభించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, హథీరాంజీ మఠం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.