మన న్యూస్:పినపాక మండలోని చింతల బయ్యారం గ్రామ యువకులకు ఏడూళ్ళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ ను సీఐ వెంకటేశ్వరరావు,ఎస్సై రాజ్ కుమార్ చేతులు మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడలతో పాటు చదువులోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఎస్సై రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.