
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గోపాలపట్నం) మే1: రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నేడు నియోజకవర్గంలో జరిగిన మే డే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవంp) లో ఆయన మాట్లాడుతూ కార్మికుల కష్టానికి తగిన గుర్తింపునిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పేదల బాగు కోసమే ప్రతి అడుగు..పింఛన్లతో అభాగ్యులకు అండగా నిలవడం,అన్న క్యాంటీన్ లతోఆకలి రహిత సమాజాని నిర్మించడం.దీపం పథకంతో ఇంటింటా ఆనందపు వెలుగులు పంచడం.. ఇలా ప్రభుత్వం వేసే ప్రతి అడుగు పేదలు,శ్రమజీవుల బాగు కోసమేనని ఆయన వివరించారు.
శ్రమజీవులకు సెల్యూట్...ప్రకృతి విపత్తులను,ప్రమాదాలను సైతం చిరునవ్వుతో ఎదుర్కొంటూ సమాజం కోసం చెమటోడుతున్న కర్షక, కార్మిక లోకానికి ప్రభుత్వం సెల్యూట్ చేస్తోంది.రాష్ట్రంలో ఉన్న88 లక్షల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
కార్మికులకు అండగా రూ.615 కోట్లు గత ఏడాది సెస్ రూపంలో సేకరించిన రూ.615 కోట్ల నిధులను పూర్తిగా కార్మికుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.88లక్షల మందికి పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ఇది కొండంత అండగా నిలుస్తుంది.
నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఈ ఏడాది 25వేల మంది కార్మికులతో పాటు,వారిపై ఆధారపడిన మరో 80వేల మంది కుటుంబసభ్యులకు అంటే మొత్తంగా1లక్ష మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నాం.
ఆర్థిక భరోసా కార్మికుల కుటుంబాల్లో శుభకార్యాలకు చేయూతనిచ్చేందుకు వివాహ కానుకగారూ.20,000, అలాగే మహిళా కార్మికులకు ప్రసూతి సాయం కిందరూ. 20,000 అందజేస్తున్నాం.
సామాజిక భద్రత దురదృష్టవశాత్తూ కార్మికుడు సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి రూ60,000ఆర్థిక సాయంతో పాటు,అంత్యక్రియల కోసం తక్షణమే మరో రూ20,000ప్రభుత్వం అందిస్తోంది.
లేబర్ అడ్డాల ఏర్పాటు మన విశాఖతో పాటు విజయవాడ,తిరుపతి, రాజమండ్రి,నెల్లూరు నగరాల్లో కార్మికుల విశ్రాంతి కోసం అత్యాధునిక సౌకర్యాలతో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నాం.
ఆరోగ్యమే మహాభాగ్యం కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.తద్వారా అనారోగ్య సమస్యలను ముందే గుర్తించి తగిన వైద్యం అందిస్తాం.అమరావతి,పోలవరం వంటి మహా నిర్మాణాలు,పారిశ్రామిక కారిడార్ల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని,దీనివల్ల మన శ్రమజీవులకు చేతినిండా పని దొరుకుతుందని ఎమ్మెల్యే తెలిపారు.జూన్ నెల నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 నూతన కార్మిక కోడ్లను రాష్ట్రంలో అమలు చేస్తూ,కార్మికుల హక్కులను మరింత పరిరక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.