
మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్ 14 : ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశం లో సంఘం వారు మాట్లాడుతూ.... గత అనేక దశాబ్దాలుగా తమిళనాడుకు చెందిన మర బోట్లు మన ఆంధ్ర సముద్ర జలాలలో అక్రమంగా ప్రవేశించి తిరుపతి, నెల్లూరు,ప్రకాశం,బాపట్ల జిల్లాలో ఉన్న సాంప్రదాయక మత్స్యకారుల జీవనోపాధిక భంగం కలిగిస్తున్నారు అని అన్నారు దీని మీద మత్యకారులు ఎన్ని ఆందోళనలు చేసిన ఉపయోగం లేకుండా పోయింది అని అన్నారు..ఈ మధ్య కాలంలో అనగా గత 10 సం రాలుగా పాండిచ్చేరి కరికల్ కు చెందిన మర బోట్లు 500 పై హెచ్.పి కలిగి, స్టీల్ బాడీ ఉన్న పెద్ద పెద్ద బోట్లు మా చిన్న ఫైబర్ పడవలు వేటాడే (12 నాటికలు మైలు లోపల) (సుమారు 22 కిలోమీటర్ల) వేట సాగిస్తూ వలలు తెంపివేసి అక్రమంగా మత్య సంపదను దోచుకుని పోవడం కాకుండా ఎదురు తిరిగిన స్థానిక మత్స్యకారుల మీద వారణాయదాలతో దాడి చేయడం పరిపాటి అయింది అని తెలిపారు.దీని నివారణకు స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి 8 నెలల క్రితం కరేకల్కు చెందిన నాలుగు బోట్లు పట్టి జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్లలో గ్రామ కాపుల ఆధీనంలో పెట్టడం జరిగింది అని అన్నారు. అయితే బోట్లు యాజమాన్యలు ముగ్గురు కాపులను ప్రలోభ పెట్టి దొంగతనంగా బోట్లు తీసుకొని పోవడం జరిగింది అని తెలిపారు.ఇందు కోసం 4 జిల్లాలలోని 164 గ్రామాల మత్య కారులు ఐక్యమత్య తో ఒక్కతాటి పైకి వచ్చి అందోళన కొనసాగించటం జరుగుతుంది అని అన్నారు. పై విషయములో ప్రభుత్వం కూడా స్పందించి ముఖ్యమంత్రి స్వయంగా ముత్యకారుల సమస్యల గురించి నెల్లూరు, తిరుపతి రెండు జిల్లాలల్లో జరిగిన సభలో మాట్లాడటమే కాకుండా కరేకల్ బోట్లు నివారణ కోసంగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం తక్షణమే మత్స్యకారుల కోరిక మేరకు 650 హెచ్.పి కలిగిన స్టీల్ బాడి బోట్లు కొనుగోలు చేసి మత్యకారులతో కూడిన కమిటీ నిరంతరం పెట్రోలింగ్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచి పరిమాణం అని తెలిపారు. అంతేకాక రాష్ట్రంలోని మత్స్యకారుల ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, కాకినాడ శాసనసభ్యులు పనమాడి వెంకటేశ్వర్లు, మత్యకార్ల అభివృద్ధికి కావలసిన విషయాలు చర్చించి క్రింది సమస్యలను ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య తరపున నాలుగు జిల్లాల మత్యకారులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసు కొని పోయి పరిష్కర దిశ గా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య వారి సమస్యలు క్రింద విధంగా తెలిపారు. 1. బోట్లు విషయంలో శాశ్వత పరిష్కారం కొరకు తమిళనాడు, పాండిచ్చేరి, ఎన్నికల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి బోట్లు రాకుండా ఇరు రాష్ట్రల బోట్ల ఆసోసి యేన్తో చర్చలు జరపాలి అని తెలియజేశారు. 2. పి ఎం ఎం ఎస్ వై పథకం ద్వారా 12000000 లకు 40% సబ్బిడి ఇస్తుంది.మనకు జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ మనగడలోకి వచ్చినందున స్థానిక మత్స్యకారులకు 50 బోట్లు కొనుగోలుకు ముఖ్య మంత్రి 20% సబ్సిడీకి ప్రత్యేక నిధుల ద్వారా 12 కోట్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము అని తెలియజేశారు.3. షిప్పింగ్ హార్బర్ లో మూడు నెలల లోపు అన్ని పనులు పూర్తి చేసి స్థానిక మత్స్యకారులకు నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి అప్పగించాలి అని తెలిపారు.4. రామాయపట్నం పోర్టుకి అనుబంధంగా వస్తున్న అనేక పరిశ్రమలు సోలార్ మరియు బీపీసీఎల్ పరిశ్రమలలో స్థానిక మత్స్యకారులకు 45% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.అంతేకాక సముద్ర జలాలను కలుషితం చేసే వ్యర్ధాలను మరియు కలుషిత జలాల పరిశ్రమల వారు సముద్రంలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు.5. మత్స్యకారుల సముద్రం వేటకు ఉపయోగపడే నది ముఖద్వారాలలో అనగా పులికాట్ ముఖ ద్వారం, విడవలూరు మండలం, పొన్నపూడి కొత్తూరు, పైడేరు ముఖ ద్వార ల పూడిక తీసి పనులు వెంటనే ప్రారంభించాలని అని తెలియజేశారు.6. సుమారు 2. 50 లక్షల జనాభా కలిగిన పట్టపు సామాజిక వర్గానికి పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇంతే కాక మన తీరంలోని అనేక సమస్యలను పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించే దిశగా, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘల సమాఖ్య ప్రయత్నం చేస్తుంది అని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో 14 మత్యకార ఉపకలాలలో ఒక ఉప కుల మైన పట్టపు సామాజిక వర్గానికి రాష్ట్రం లో అని ఉప కులాలు అనగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘల సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నాయి అని తెలియజేశారు.ఈ సమావేశంలో సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నడకుదిటి అర్జున, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల వాసు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు వావిళ్ళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
,
