
కలిగిరి, ఏప్రిల్ 11, మన న్యూస్, ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పెద్దఅన్నలూరు అంగనవాడి కేంద్రంలో పిల్లలకు జంక్ ఫుడ్ తినకుండా టీవీలు చూడ కుండా మరియు మొబైల్స్ వాడకుండా బొమ్మలతో నే ఆడుకోవాలఅని అంగన్వాడీ టీచర్ పి సునితమ్మ తెలిపింది.అంతే కాకుండా స్థానిక మార్కెట్లో ప్యాకెట్స్ ఫుడ్స్ మరియు సాంప్రదాయ మధ్య తేడా వంటి ఆరోగ్య ప్రభావాల గురించి ప్రదర్శించడం జరిగింది. బిస్కెట్ లకు బదులు నిల్లేటిట్లు వాడితే పిల్లలకు ఆరోగ్య గా ఉంటుందని పెద్దన్నలూరు అంగన్వాడీ సెంటర్లో అంగనవాడి టీచర్ పి సునీతమ్మ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ ఇరగాల మహేశ్వర రావు, అంగన్వాడీ ఆయమ్మ ఉదయగిరి మాధవి, పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.