
కలిగిరీ ఏప్రిల్ 9 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేదలపాటి పెన్నిధి, పేదల కోసమే విపిఆర్ కంటి పరీక్షల బండి. ప్రజలు చల్లగా సంతోషంగా చూడాలని ఆశయంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ త్రినేత్ర బండిని స్థాపించారని బొల్లినేని వెంకట రామారావు అన్నారు.

గురువారం ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లో పెద్దకొండూరు గ్రామం లో టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లి నేని వెంకట రామారావు ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ వారి కంటి వైద్య శిబిరరాన్ని ప్రారంభించారు. పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి వారికి ఆయన దగ్గర ఉండి వచ్చిన పేసెంట్ లకు కంటి పరీక్షలు చెంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతో మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి వారికి కంటి అద్దాలు మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల గ్రామాలలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు . రాష్ట్రంలో ఎన్నడు లేనివిధంగా ఎవ్వరు చైనీ విధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేదల పాటి పెన్నిధిగా పనిచేస్తున్నారని అన్నారు.పెద్దకొండూరు గ్రామ పంచాయతీ కీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆనంద వ్యక్తం చెందారు.అదేవిదంగా పెద్దకొండూరు గ్రామ ప్రజలకు ఈ అవకాశం కల్పించిన మన నాయకులు ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులైన కాకర్ల సురేష్, కి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి వృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వెల్లంకి కొండప నాయుడు,మాజీ సర్పంచ్ మొక్క హజాత రావు, నీటి సంగ అధ్యక్షుడు ద్రోణాదుల రమేష్, మన్నేపల్లి వెంకటరావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, ద్రోణాదుల వెంకటేశ్వర్లు,తదితర నాయకులు పాల్గొన్నారు.
