
కలిగిరి, మార్చి 26,మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, చేరెడ్డి రెడ్డి శ్రీలత, తన దేవంగత భర్త చే రెడ్డి పెద్దిరెడ్డి జ్ఞాపకార్థం స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకoనీరు, పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతిరోజు ఆమే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బాటసారిల దాహార్తిని తీర్చేందుకు ప్రతిరోజు మజ్జిగ మరియు నీరును ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. భర్త పై ఉన్న ప్రేమను సామాజిక సేవగా మార్చి శ్రీలత చూపుతున్న ఈ మానవత్వం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది.
