
మన ధ్యాస:- , మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ లోని అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ గా నాగమల్ల శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారము అష్టలక్ష్మి దేవాలయం నూతన కమిటీని మూడు సంవత్సరాల గాను ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినారు. అధ్య క్షుడిగా నాగమళ్ళ శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ గా వనం యాదయ్య, జనరల్ సెక్రటరీగా, మాడ్యం సుధాకర్ గుప్తా, ట్రెజరర్ గా దాచేపల్లి శ్రీనివాస్, సెక్రటరీలుగా శ్రీనివాసు గోవిందు, కోకుండా చంద్రశేఖర్, బిక్కుమల్ల పవన్ కుమార్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షు డుమాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ఎలక్షన్ అధికారులుగా గౌరిశెట్టి చంద్రశేఖర్, ఉప్పల నాగేశ్వ రరావు, భరద్వాజ్, పబ్బా శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
