
కలిగిరి, మార్చి 14,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.
కలిగిరి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి-40సీట్లకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (MPHW- నర్సింగ్) గ్రూప్ - 40సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు, ఈ అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ లో కె.జి.బి.వి.సైట్ లో అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె.సుప్రియ తెలియజేశారు.ఈ అడ్మిషన్స్ మార్చి 12వ తేది నుండి ఏప్రిల్ 1వ తేది వరకు అప్లై చేసిన విద్యార్థునుల డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసి ఏప్రిల్ 13వ తేది నాడు సెలెక్టెడ్ లిస్ట్ కళాశాల నందు రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు.ఈ అడ్మిషన్స్ కి సెలెక్ట్ అయిన విద్యార్థినులకు ఉచిత రెసిడెన్షియల్ విద్య, హాస్టల్, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్ తదితర అన్ని సౌకర్యములతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం, అడ్మిషన్స్ కోసం కె.జి.బి.వి. ప్రిన్సిపాల్ గారిని (ఫోన్ నెంబర్-8074128531సంప్రదించవలసినదిగా తెలిపారు. అదేవిధంగా మరిన్ని వివరాల కోసం apkgbv.apcffss.in వెబ్సైటు లో చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు