
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.
బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని,ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస విరమణ చేశారు.అనంతరం అందరితో కలిసి భోజనం చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..రంజాన్ పర్వదినం మనకు ఐక్యత, సహనం,సేవా భావాన్ని గుర్తు చేసే పవిత్రమైన కాలమని అన్నారు.ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.
సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని తెలిపారు.ఈ నెల రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతీ ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థించారు.ముస్లిం సోదరులు ఆర్థికంగా, రాజకీయంగా,సామజికంగా, విద్యా పరంగా వెనుకబడి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజన వసతులతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత సామరస్యానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.
ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రంజాన్ పండగ ముస్లిం సోదరుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ఇఫ్తార్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద మున్సిపల్ కౌన్సిలర్ లు గులాం సంధాని,ముజాహిద్, గంగాధర్,నౌషా నాయక్,మారుతీ, సాహెల్ షట్కర్,తదితరులు ఉన్నారు