
ఉదయగిరి, మార్చి, 10,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.
ఉదయగిరి మండలం దాసపల్లి పంచాయతీలోని వడ్లమూడిపల్లి గ్రామంలో వర్షం పడినప్పుడల్లా గ్రామస్తులు బురద తో ఇబ్బంది గురవుతున్నారు స్థానిక టిడిపి నాయకులు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ కీ తెలియజేయగా,యుద్ధ ప్రాతిపదికన జడ్పీ నిధులతో సుమారు 15 లక్షల రూపాయలు తో రోడ్స్ మంజూరుచేశారు.అనంతరం ఆ గ్రామ ప్రజలు సంతోషవ్యక్తం చెందారు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాటలు చెప్పే ఎమ్మెల్యే కాదు పని చేసే ఎమ్మెల్యే అని గ్రామస్తులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు వెంకటాద్రి నాయుడు, హరీష్ యాదవ్,శ్రీను నాయుడు, వెంకటేష్ యాదవ్, గర్రయ్య నాయుడు,మరియు పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీరాములు పాల్గొన్నారు