
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా జిపి కార్మికులతో పాటు గ్రామానికి చెందిన యువకులు,పెద్దలు కలిసి కట్టుగా గ్రామ పరిశుభ్రతనే ధ్యేయంగా శ్రమదానం చేశారని గ్రామ సర్పంచ్ సుమిత్ర శ్రీనివాస్ లు అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని గ్రామ పరిశుభ్రత,చెత్తాచెదారం లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం అంశాలను తీసుకొని గ్రామస్తులతో కలిసి పిచ్చి మొక్కలు,గడ్డి ముళ్ళ పొదలను తొలగించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేంగారం కవిత పండరి, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు గుర్రపు వెంకటేశం,చికోటి నారాయణ,రాజ్యం గంగారం,మామిళ్ళ సాయిలు, కాశవ్వ, బాలయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి భారతి, గ్రామ పరిపాలన అధికారి సాయిబాబా, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు సిబ్బంది పోచయ్య, లచ్చయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.