నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన తహశీల్దార్ ఎం సూర్యప్రభ
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:
అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రత్తిపాడు మండల కమిటీ ఎన్నిక రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శివరామ్,కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ అవసరాల కిషోర్ సమక్షంలో బుధవారం మండల వనరుల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.కమిటీ చైర్మన్ గా డిప్యూటీ తహసీల్దార్ కె పుణ్యవతి,కో చైర్మన్ గా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎ గోపాలకృష్ణ,కన్వీనర్ గా విఆర్వో ఈపి రాజేష్,సెక్రెటరీ జనరల్ గా విలేజ్ సర్వేయర్ డి నఖిల్,ట్రెజరర్ గా వీఆర్వో పద్మిని,వైస్ చైర్మన్ -1 గా డి .సాయివర్మ (సీనియర్ అసిస్టెంట్), వైస్ ఛైర్మన్ -2 గా వి శివ (వీఆర్వో),వైస్ చైర్మన్ -3 గా ఎం గంగరాజు (విఆర్ఎ ),వైస్ ఛైర్మన్-4 గా ఎం వీర దుర్గ (విఎస్),జాయింట్ సెక్రటరీ-1 గా వి గుర్రాజు (విఆర్వో), జాయింట్ సెక్రటరీ -2 గా కె రామకృష్ణ(విఆర్ఎ),జాయింట్ సెక్రటరీ -3 గా G. లోవరాజు(విఎస్ ) లను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు.నూతన కమిటీకి తహాశీల్దార్ ఎం సూర్యప్రభతో పాటు పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు