మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి,రాత్రి సమయంలో మద్యం సేవించి 100 డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు బానోతు రమేష్ అనే వ్యక్తిని మాచారెడ్డి తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అత్యవసర సమయంలో తప్ప అనవసరంగా మద్యం సేవించి 100 డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.