
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా..
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి,మొహమ్మద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాధుల మాజీ వైస్ ఎంపీపీ మనోహర్,మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి, గున్కుల్ మాజీ సొసైటీ చైర్మన్ వాజీద్ అలీ, అచ్చంపేట మాజీ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి లు కలసి కేకులు కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. బీ ఆర్ ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకం ప్రతి ఒక్క పేదలకు అందిందని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజలందరూ కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ గౌడ్,రాం చందర్,దపేదర్ విజేయ్, ఆనంద్ కుమార్,కమ్మరి కథ అంజయ్యస్,మేకల విజేయ్,రాజు, గరబోయిన వెంకటేశం,మర్పల్లి రాములు, లక్ష్మా రెడ్డి, లక్ష్మీనారాయణ, చందర్,అఫ్జల్,తదితరులు ఉన్నారు.