మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామం ఉన్న ఆలయాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు శుక్రవారం దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ రమేష్ రాజు ముద్రగడ గిరిబాబు సాధరంగా స్వాగతం పలికారు,అనంతరం కొండరాజులు బాబు ఆలయంలో ముద్రగడ గిరిబాబు పాటు మండల వైసీపీ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ముద్రగడ గిరిబాబుకు బహుమతిగా
అందించారు.ఈ కార్యక్రమంలో పట్టా సుబ్బారావు, పడాల అప్పారావు దొర, సిరికోటి రామారావు,వైసిపి రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్,
పార్టీ కన్వీనర్లు, శిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్,సుంకర రాంబాబు,సామంతుల సూర్య కుమార్, బిసెట్టి అప్పలరాజు,గుల్లంపూడి గంగాధర్,చంటిబాబు, గుమ్ములూరు వెంకటరమణ,సఖిరెడ్డి బుజ్జి, కాలారి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.