
బంగారుపాళ్యం,మన ధ్యాస,ఫిబ్రవరి 9. రిపోర్టర్ కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె.బాలాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి అందరికి పంచిపెట్టారు.అనంతరం బాలాజీ ని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కె.పి.రంగనాథ్, ఎట్టెరి.నాగరాజు,మొగిలి గజేంద్ర, జంబువారిపల్లి ఆర్టీసీ బాబు,రవి,చిన్న,మంగళపల్లి చుక్కా ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.