మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డింగ్ అన్నవరం వరకు
నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు తారు రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పని పూర్తి చేయాలని ప్రత్తిపాడు నియోజవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఆదివారం ఆర్ అండ్ బి అధికారులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తొందరగా రోడ్డు పనులు చేయాలని సూచించారు. రోడ్డు సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అలమండ చలమయ్య, బోదిరెడ్డి గోపి, ముది నారాయణస్వామి, గొల్లపల్లి బుజ్జి, సూది బోరయ్య, వైబోగుల సుబ్బారావు, నూకతాటి ఈశ్వరుడు,కూటమి నాయకులు, అభిమానులు కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.