
మంగళగిరి, జనవరి 28,మన ధ్యాస,(నాగరాజు కె ).
మంగళవారం మంగళగిరి లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి గార్ల దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మేకపాటి దంపతులను మంత్రి నారా లోకేష్ ఆప్యాయతంగా పలకరించారు అదేవిధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని, మహిళలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, నెల్లూరు జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేయాలని శ్రీమతి మేకపాటి శాంతి కుమారి కి మంత్రి నారా లోకేష్ సూచించారు.