మన న్యూస్: కళ్ళు గీత వ్రుత్తి కార్మికులు ప్రమాదంలో ఉన్నారని ప్రమాద నివారణకు ప్రభుత్వం ఇచ్చిన సేప్టీ కిట్టులు 10వేలు మాత్రమే పంపిణి చేశారని డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. ఎల్ బి నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్కడుతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత కార్మికుల బహిరంగ సభలో గీత కార్మికులకు పెండింగ్ లో ఉన్న 7కోట్ల 90లక్షల రుపాయలను ఎక్స్ గ్రేసియాను విడుదల చేస్తానని చెప్పడం చాలా సంతోషం అన్నారు .నెక్లస్ రోడ్ లోనినీరా కేఫ్ నందనంలోని నీరా ప్రాజెక్టును స్వాదీనం చేసుకొని వాటిని టాడి కార్పొరేషన్ ద్వారా నిధులను కెటాయించి కల్లు గీతా కార్మికులకు కార్పోరేషన్ను ఏర్పాటు చేసి దానికి సభ్యులను నియమించి కార్పొరేషన్ ద్వారా గీత కార్మికుల సమస్యలు పరిష్కరించవలసినది కోరుతున్నాను.దీని తద్వారా గీతా కార్మికుల ఉపాధి మెరుగుపరుస్తుందని అన్నారు.గత ప్రభుత్వంలో కులాల వారిగా విడదీసి కులాలో వైషమ్యాలు స్రుష్టించారని అన్నారు. గీతా వ్రుత్తిని నిర్లక్ష్యం చేశారని మూసి నది పరివాహక ప్రాంతంలో కల్లు కలుషితమైనదని తల్లి చేసిన మేలు కల్లు చేస్తుందనే గీతన్నల నమ్మకం అలాంటిది. అలాంటి వ్రుత్గిని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా గీత కార్మికులు చెట్టుపైనుండి పడి చనిపోయారు.
వ్రుత్తిలో ప్రమాదం జరిగిన వారికి టాడి టాపర్ ద్వారా ఆర్దిక సహయం అందించి ఆయా గీత కార్మికుల కుటుంబాలను ఆదుకున్నవారు అవుతారు.ఏజెన్సీ ప్రాంతంలో సొసైటీలను పునరుద్ధరించాలని టాడి టాపర్లకు ద్విచక్రవాహనాలు అందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి క్రష్షా రావు గీత కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు సమిక్షించి ప్రమాదం అంచులో ఉన్బ వ్రుత్తి కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల అంజయ్య మల్లేబోయిన రమేష్ గౌడ్ శోబన్ తదితరులు పాల్గొన్నారు…