
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్నగర్ మండలంలోని మగ్దూంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మాజీ సర్పంచ్ భీమన్పల్లి లక్ష్మీనారాయణ ఎల్ ఈ డీ టీవీని బహుకరించారు.విద్యార్థుల బోధనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయ బృందం మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్, ప్రేమాజీ,షఫీ, సంతోష్కుమార్,సాయిలు గ్గ్రామస్థులు సిద్ధగౌడ్,రవి,తదితరులు ఉన్నారు.