
గూడూరు, మన న్యూస్, జనవరి 05,(నాగరాజు కె).
గూడూరు లోని ధాబాలలో విచ్చలవిడిగా మద్యం ప్రియులు. అర్ధరాత్రి దాటినా ధాబాలలో మద్యం ప్రియులు మద్యం సేవించినా అడిగే నాథుడే లేడు. ఎందుకంటే నెల నెలా లక్షలు రూపాయలు మామూళ్లు రూపం లో పోలీస్, ఎక్సైజ్ అధికారులకు ముట్టుతున్నట్లు బహిరంగ సమాచారం అని గూడూరు లో ఎవరిని అడిగిన చెబుతారు.రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు, వాటిలో కూడా భారీ గానే మామూళ్లు కూడా ఆయా శాఖల అధికారులకు ఇస్తున్నట్లు కూడా గూడూరు లో కోడై కూస్తుంది. పట్టించుకోవాల్సిన రెవిన్యూ, సివిల్ సప్లై అధికారులు మామూళ్లమత్తులో మౌనం గా ఉన్నట్లు తెలుస్తుంది.బంగారం కూడాఎటువంటి అనుమతి, పన్నులు చెల్లించకుండా, అక్రమంగా గూడూరు కి తీసుకొని వచ్చి కొంతమంది వ్యాపారం చేస్తున్నట్లు, దానిద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు, లక్షలు రూపాయలు మామూళ్లు ఆయా శాఖల అధికారులకు వెళుతున్నట్లు బహిరంగ సమాచారం.గూడూరు పట్టణంలోని రాజా వీధిలో దాదాపు 100కు పైగా బంగారు దుకాణాలు కలిసి ఉన్నాయి వీటికి ప్రభుత్వానికి రావలసిన ఆదాయం పెట్టి తమ సొంత స్వలాభం కోసం జీఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ఎస్టిమేషన్ బిల్లు ద్వారా బంగారం అమ్మకాలు సాగిస్తున్నారు వీళ్ళపై కూడా జీఎస్టీ అధికారులు ఇన్కమ్ టాక్స్ అధికారులు కూడా దర్యాప్తు జరిగితే ప్రభుత్వానికి అధిక సంఖ్యలో ఆదాయం వచ్చే అవకాశం,గూడూరు పాతబస్టాండ్ నుండి ఆర్ టీ సీ బస్సు స్టాండ్ వరకు, అలాగే పాత బస్టాండ్ నుండి రెండో పట్టణం లోని గాంధీ నగర్ వరకు, అలాగే వెంకటగిరి రోడ్డు వరకు నిత్యం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి రోడ్డు పైనే నిరంతరం ఆటోలతో ట్రాఫిక్ కి అంతరాయం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. పోలీస్ అధికారులు కాస్తా కూస్తో పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా, ఆటోవాలాలు, తోపుడు బండ్లు, పూల దుకాణాలు వాళ్ళతీరు మాత్రం మారడం లేదు.పాత బస్టాండ్ లోని దుకాణాలవాళ్ళు షాప్ ముందు నడిచి వెళ్లేందుకు దారి ఉండాలి. కానీ దానిని ఆక్రమించి గోడ కట్టేసి, దుకాణం ముందుకు రేకులు బిగించి, ప్లాస్టిక్ పట్టల తో ముందుకు రావడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతుంది. రవాణా శాఖ, మునిసిపల్ అధికారులు మౌనం గా ఉన్నారో? మామూళ్లమత్తులో ఉన్నారో? రేపు ఎస్పీ అజితావేజెండ్ల మేడం విచారణ లో తెలియాల్సివుంది.మరొక పెద్ద సమస్య…గూడూరు లోని ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ (ఇటీవల యూనివర్సిటీ )లోకి గంజాయి భారీ గా వెళ్తున్నట్లు, విద్యార్థులు గంజాయి మత్తులో గొడవలు కూడా పెట్టుకున్న సంఘటనలు జరిగాయి. కొన్ని కేసులు కూడా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు.ఆ విషయం ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. గంజాయి గూడూరు నుండి, కాలేజీ లోకి వెళ్తుందా? లేకపోతే ఎక్కడ నుండి వెళ్తుంది అనేది అంతుచిక్కని ప్రశ్న.గూడూరు లో ముఖ్యంగా ముగ్గురు, నలుగురు యువకులు రాత్రి వేళల్లో బైక్ పై వెళ్తూ, పెద్ద పెద్ద సౌండ్ వచ్చేలా హారన్ కొడుతూ తిరుగుతున్నారు.అంతేకాకుండా రోజు రోజు కి పెట్రేగి పోతున్న యువకులను,అదుపులో పెట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకొని అజితా వేజెండ్ల మేడం తన పని తీరు చూపిస్తుందో? లేదో చూడాలి? ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందో?,)లేదో?నెల్లూరు జిల్లా లో ని, సిటీ లో ట్రాఫిక్, సిటీలోని రౌడీలు, ఆకతాయిలకు, రౌడీ షీటర్ లకు చుక్కలు చూపించిన జిల్లా ఎస్పీ అజితా మేడం గూడూరు లో కూడాఇలాంటి వాళ్ళు అందరికీ భయం పుట్టించి తమ పని తీరు మార్చుకొని మంచి వాళ్ళు గా నడుచుకోవాలి అని హెచ్చరిక చేసి, పోలీస్ అధికారులకు సూచనలు ఇస్తారని ఆశిస్తున్న గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు.