మన ధ్యాస ప్రతినిథి
ఏలేశ్వరం: ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమ పిలుపు కొరకు,భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు,శనివారం ఉదయం 7 గంటల నుండి ఊరు, ఊరు ప్రచారానికి ఆటో కు జెండాను ఊపి యు వి ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మరియు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ,జాతీయ నాయకత్వం పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని,సనాతన ధర్మం మరియు హిందూయిజం భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా విస్తరించాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో యు వి ఆర్ గ్రూప్ సిబ్బంది మరియు సహచరులు పాల్గొన్నారు.