మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం స్థానిక బాలాజీ చౌక్ సమీపంలో వాహనాలను ఏలేశ్వరం పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.ఏలేశ్వరం నుండి లింగంపర్తి వెళ్లే రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని, అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డు పై నడిపిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, తాగి వాహనాలు నరకకూడదని. వాహనాలు పై ఉన్న పెండింగ్ చలాన్లు కట్టివేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం
పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు