
మన ధ్యాస,గూడూరు, డిసెంబర్ 26 :గత ప్రభుత్వం తొందరపాటు తనలో విభజన చేపట్టిందని గూడూరు శ్రీమంతుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి విమర్శించారు. గత నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ప్రజాభిప్రాయం మేరకు పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. కనుమూరు హరిశ్చంద్ర రెడ్డి తన మనసులో మాటలు, గూడూరు ప్రజల సమస్యలు, టీడీపీ పాలన గురుంచి, ఎమ్మెల్యే పా శిం సునీల్ కుమార్ తో సన్నిహితం, గత వైసీపీ ప్రభుత్వం లో ఎదుర్కొన్న పరిస్థితులు ఇలా మనసులో ఉన్న భావాలు పంచుకొన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలోనే గూడూరు ప్రజలు దగ పడ్డారుని తెలిపారు. ఆనాడు గూడూరు ను తిరుపతి జిల్లాలో కలిపితే తాను వైసీపీ ఆదినాయుకులను ప్రశ్నిస్తేవారు గూడూరు ను తిరిగి మరలానెల్లూరు జిల్లా లో కలుపుతామని చెప్పి మాట చెప్పి మోసం చేశారు. వైసీపీ ఆదేశాలు,సజ్జల, పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ చేపట్టాను, పాలాభిషేకాలు చేసాం ఇది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అందుకే నాడువైసీపీ పార్టీకిరాజీనామా చేసి 2024 ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరి మా మిత్రుడు పాశిం సునీల్ కుమార్ గెలుపు కోసం శ్రమించి గెలిపిచుకున్నామని తెలిపారు.సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన కూటమి ప్రభుత్వం 18 నెలల పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ను సూపర్ హిట్ గా సియం చంద్రబాబు అమలు చేశారని చెప్పారు.సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థమిచ్చాం,మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డులేదు అన్నారు.64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,రూ.10 వేల కోట్లతో తల్లికి వందనం, అన్నదాతల ఖాతాల్లో 3,173 కోట్లు జమ,2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,ఈ నెలాఖరుకు 16,347 టీచర్ పోస్టుల భర్తీ,ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశాం,ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 10 వేలు,అర్చకుల వేతనాలు రూ.15 వేలకు పెంచాం,నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలు చేశాం,గీత కార్మికులకు 10ు మద్యం షాపులు, బార్లు, మత్స్యకారులకురూ.259 కోట్ల సాయం,చేనేతకు అండగా ఉచిత కరెంటు,ఇమామ్లకు రూ.10 వేలు.. మౌజన్లకు 5 వేలు అందించి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని తెలిపారు.గూడూరు ను జిల్లా చేయండి:హరిశ్చంద్ర రెడ్డిగూడూరు ను జిల్లా కేంద్రం గా చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్ బాబులను రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్ర రెడ్డికోరారు. గూడూరు ను అనుకోని ఉన్న సూళ్లూరుపేట, వేంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలను కలుపుకొని గూడూరు ను జిల్లా చేయాలి, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయి. మైకా, క్వార్జ్, సిలిక, ఇసుక, నిమ్మ, ఆక్వా అన్ని ఉన్నాయి. కృష్ణపట్నం పోర్ట్, శ్రీ సిటీ, శ్రీహరి కోట, పులి కాట్, సముద్ర తీరం, ఆధ్యాత్మిక కేంద్రాలు అన్ని ఉన్నాయి. గూడూరు ను జిల్లా చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా కలెక్టర్, ఎస్ పి కార్యాలయం అన్ని ప్రభుత్వ శాఖ లు గూడూరు కు వస్తాయి. ప్రజలు, యువత అభివృద్ధి చెందుతారని అందువలన గూడూరు ను జిల్లా చేయాలనీ ఆయన కోరారు. గూడూరు కోసం ఉద్యమిస్తున్న జేఏసీ కి మద్దత్తు :హరిశ్చంద్ర రెడ్డిగూడూరు ను జిల్లా కేంద్రం చేయాలనీ లేక గూడూరు నియోజకవర్గం ను నెల్లూరు జిల్లా లో కలపాలని గూడూరు జేఏసీ చేస్తున్న ఉద్యమానికి తాను ఎప్పుడు అండగా మద్దత్తు ఇస్తానని కనుమూరు హరిశ్చంద్ర రెడ్డితెలిపారు. కానీ ఉద్యమం లోఈ ప్రాంతానికి చెందని కొంతమంది సిపిఐ నాయుకులు దీక్ష లో కూర్చుని మా అధి నాయుకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు లపై అసభ్య పదజాలం తో మాట్లాడం భావ్యంకాదు, ఎవరండీ అసలు మీరు మా గూడూరు ప్రజలు వరదలు, కరోనా సమయంలో ఇబ్బంది పడుతుంటే మీరు బియ్యం, సరుకులుఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, ఏ చిన్న సాయం చేసారా.. ఇప్పుడు గూడూరు లో ప్రత్యక్షం అయ్యి మా నాయకులపై విమర్శలు చేస్తే బాగుండదు.. స్టూడెంట్ నాయుకులు మనోజ్ మీరు దగ్గర ఉండి ఇలా మాట్లాడించడం పద్ధతి కాదు అన్నారు. మనం చేసే ఉద్యమం స్ఫూర్తి తో నడవాలని ఆయన సూచనలు చేశారు.ప్రసన్న మీకు ఇప్పుడు గూడూరు గుర్తుకు వచ్చిందా. :మాజీ మంత్రి, కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీకు ఇప్పుడు గూడూరు గుర్తుకు వచ్చిందా.. మీ పెద్దనాన్న చంద్రశేఖర్ రెడ్డి,మీ తండ్రి శ్రీనివాసులు రెడ్డి లు అంటే మాకు గౌరవం వారు చేసిన అభివృద్ధి, సేవలు గూడూరు ప్రజలు ఎన్నటికీ మరువరు, కానీ మీరు వైసీపీ లో ఉండి నాడు గూడూరును అన్యాయం గా తిరుపతి లో కలిపితే మీరు ఒక్క మాట అడగలేదు, ఇప్పుడు గూడూరు లో దీక్షలు చేస్తాం, ధర్నా లు చేస్తాము అని చెప్పడం హాస్యాస్పదం గా ఉంది. మీ సేవలు మాకు వద్దు మా.. సోదరులు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన గూడూరు ను కాపాడుకుంటారు ఆయన న్యాయకత్వం లో గూడూరు జిల్లా అవుతుంది. లేదా నెల్లూరు జిల్లా లో కలుస్తుందన్నారు.సోదర సునీల్ క్షణిక ఆవేశం వద్దు అని అన్నారు.మా ప్రియ మిత్రులు, సోదరులు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మీరు ఇటీవల జరిగిన ఓ సభ లో గూడూరు ను నెల్లూరు జిల్లా లో కలపకపోతె రాజకీయాలకు దూరం అవుతానని చెప్పారు. అది తప్పు సోదర మీరు ఎమ్మెల్యే గా కొనసాగాలి రాజకీయాల్లో ఉండాలి.. మీరు అనుకుంటే గూడూరు ప్రజలకు న్యాయం జరుగుతుంది. మీరు మొదటి నుండి గూడూరు ప్రజల పక్షం ఉండి పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ లో మాట్లాడారు.. సియం, మంత్రి లోకేష్ లతో మాట్లాడారు. మీ గళం వినిపించారు. మీరు కోరుకున్నట్లు గూడూరు జిల్లా అవుతుంది. లేదా నెల్లూరు లో కలస్తుంది. మీ వెంట మేము, గూడూరు ప్రజలు ఉన్నారు. అంతే కానీ క్షణిక ఆవేశంలో తొందరా పాటు నిర్ణయాలు వద్దు మిత్రమా అని ఎమ్మెల్యే కి సూచనలు చేశారు.
