
కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 24,(నాగరాజు కె).
కలిగిరి మండలం లోని వెనక్కన్నపాలెం sc కాలనీ చర్చి నందు స్వీట్లు పంపిణీ చేసిన టీడీపీ మండల అధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి, టీడీపీ ఉదయగిరి నియోజకవర్గం ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య,వెంకన్నపాలెం చర్చి సంఘ పెద్దలకు కు బుధవారం రుచికరమైన స్వీట్లు పంపిణీ చేశారు.ఫ్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ ఏసుప్రభు దీవెనలు అందరికీ ఉండాలని క్రిస్మస్ పర్వదినం రోజున ప్రార్థనలు చేయాలన్నారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో వర్ధిల్లే విధంగా, కలిగిరి మండలం లోని రైతాంగానికి పాడిపంటలు సమృద్ధిగా పండి,సుఖశాంతులతో ఉండేలా ఏసుప్రభు దీవెనలు అందించాలన్నారు.క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి గ్రామ నాయకులు,చర్చి సంఘ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.