మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో ఉన్న అఖిల్ విద్యాసంస్థల్లో అధినేత ఇనకోటి గంగాధర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్లు జ్యోతి అమ్మ,తాకి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని,ఏసుక్రీస్తు చూపిన బాటలో నడిచి,సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా అఖిల్ విద్యాసంస్థల అధినేత ఇనకోటి గంగాధర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ,త్యాగం,మానవత్వానికి ప్రతీక అని తెలిపారు.విద్యార్థులు మంచి విలువలు క్రమశిక్షణతో ఉంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్థి మంచి నడవడిక,నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇనకోటి సునీత,స్కూల్ ఇంచార్జి నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.