
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 23 : నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ప్రజా సత్తా ఆధ్వర్యంలో విదేశీ విద్యా దీవెన లో డాక్టర్ కోర్స్ ఎంపికైన విదేశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రులతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ విలేకరుల సమావేశంలో ప్రజా సత్తా జాతీయ అధ్యక్షుడు పులగర శోభన్ బాబు మాట్లాడుతూ...... గత ప్రభుత్వంలో జగనన్న విదేశీ విద్యా దీవెన( జెవివి) పథకం ద్వారా 2022వ సంవత్సరంలో విదేశాలలో ఎంబిబిఎస్,డాక్టర్ కోర్సులు చదవడానికి రాష్ట్రస్థాయిలో ప్రతిభా కలిగిన వారిని ఎంపిపి చేసి రెండు విడతలుగా 12 లక్షల ఫీజులు అందించడం జరిగింది అని అన్నారు. ప్రస్తుతం మూడవ విడత ఫీజులు విద్యార్థులకు చెల్లించనందున కజకిస్తాన్ దేశంలోని ఆల్ఫరాబి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు బకాయిలు చెల్లించకపోతే పరీక్షలకు హాజరు కానివ్వమని వారికి వార్నింగ్ లెటర్లు ఇచ్చినట్లు పులగర శోభన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సంక్షేమాన్ని ఆలోచించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యార్థుల భవిష్యత్తుకై ధైర్యాన్నిచ్చే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు,ప్రముఖ విద్యా ప్రదాత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు వెంటనే రాష్ట్రస్థాయిలో విదేశాలలో ఎంబిబిఎస్ విదేశీ విద్యా దీవెన ద్వారా చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్పులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుఅనంతరం విద్యార్థుల తల్లితండ్రులైన షబానామాట్లాడుతూ.....నిరుపేదలమైన మాకు రాష్ట్రప్రభుత్వం పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా బకాయిల ఫీజులు చెల్లించి మా బిడ్డలు చదువులు కొనసాగించుటకు సహాయపడగలరని కోరారు.షేక్ మౌలాలి మాట్లాడుతూ..... విద్యార్థుల ఫీజులకు అప్పులు చేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని విద్యార్థుల మానసిక, ఆర్థిక పరిస్థితులకు వారి భవిష్యత్తుకు రాష్ట్రప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు షేక్ మౌలాలి,షేక్ షబానా, షేక్ హసీనా బేగం, కే. వెంకటేశ్వర్లు, షేక్ బాబ్జి, ప్రజా సత్తా నాయకులు సిహెచ్ దయాకర్,షేక్ గౌసియా, షేక్ హసీనా, జాహిదా,ఆర్సియా తదితరులు పాల్గొన్నారు.
