
కొమరాడ /మనధ్యాస /డిసెంబర్22
గిరిజన ప్రాంతాల్లో స్వయం పరిపాలన, హక్కుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేసా చట్టంపై కొమరాడ మండల కేంద్రంలో సోమవారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండలంలోని 20 గిరిజన గ్రామాల పరిధిలోని పేసా సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులకు ఈ శిక్షణ ఇచ్చారు. గిరిపుత్రులకు దక్కనున్న సర్వాధికారాలు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే.. గ్రామాల్లోని సహజ వనరులు, అటవీ ఉత్పత్తులపై గ్రామసభలకు ఉండే విశేష అధికారాలను వివరించారు. ముఖ్యంగా: సాంస్కృతిక పరిరక్షణ: గిరిజన ఆచారాలు, కట్టుబాట్లను కాపాడుకునే హక్కు. వనరుల నిర్వహణ: భూమి, నీరు మరియు మైనర్ అటవీ ఉత్పత్తులపై గ్రామసభల నియంత్రణ.
అధికారాల వినియోగం: గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, లబ్ధిదారుల ఎంపికలో గ్రామసభ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.పాల్గొన్న ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో కొమరాడ ఎంపీడీవో గారు ఎం. మల్లికార్జున రావు,డిప్యూటీ ఎంపీడీవో రాధాకృష్ణ, పార్వతీపురం బ్రాంచ్ జీసీసీ జీసీసీ మేనేజర్ ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొని శిక్షణార్థులకు దిశానిర్దేశం చేశారు. గిరిజన చట్టాల పట్ల ప్రతి ప్రజాప్రతినిధి అవగాహన పెంచుకున్నప్పుడే గ్రామాల్లో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొన్న సెక్రటరీలు, వార్డు మెంబర్లు తమ సందేహాలను అధికారుల ద్వారా నివృత్తి చేసుకున్నారు. పేసా చట్టం ద్వారా లభించే అధికారాలను బాధ్యతాయుతంగా వినియోగించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.