ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || డిసెంబర్ 22, 2025, 8:45 pm
పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండలంలో ఆగని ఏనుగుల దాడులు.

- ఆదివారం,సోమవారం కూడా పంట పొలాల పై దాడులు.అధిక మొత్తంలో పంట పొలాల ధ్వంసం
- బంగారుపాళ్యం డిసెంబర్ 22 మన ద్యాస
- బంగారుపాళ్యం మండల పరిధిలోని ఎద్దులవారిపల్లి, మడుపోలూరు, కాటప్పగారిపల్లి గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలపై ఏనుగులు వరుసగా ఆదివారం రాత్రి,సోమవారం బీభత్సం సృష్టించాయి.పలు గ్రామాల రైతులకు చెందిన సపోటా,అరటి,మామిడి, జొన్న,రాగి,వరిపైరు పంటలను ధ్వంసం ధ్వంసం చేశాయి.ఏనుగుల గుంపు దాడిలో బోర్ పైపులు,ఆవుల షెడ్ లు ధ్వంసం అయ్యాయి. సోమవారం కూడా ఏనుగులు ఎద్దులవారిపల్లి పరిసరాలలో ఉన్నాయి.అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను తరిమివేయాలని తీవ్రంగా నష్ట పోయిన రైతులు కోరుతున్నారు.అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.పోటో2 పగటిపూట కూడా గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు.
https://www.mananews.co.in