
మన ధ్యాస ,నెల్లూరు ,డిసెంబర్ 21:పట్టుచీరలపై నాణ్యత, నైపుణ్యం, సంప్రదాయం కలగలిసిన అరుదైన కలయికగా పేరుగాంచిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఎగ్జిబిషన్ నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది. పట్టుచీరలపై ఆసక్తి ఉన్న మహిళలు, యువతీ లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొనుగోళ్లలో పాల్గొంటుండటంతో ఎగ్జిబిషన్ సందడి నెలకొంది. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర పి వి ఆర్ కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ....... మహిళలకు నచ్చే పట్టు చీరలు ఎగ్జిబిషన్ నెల్లూరు లో ప్రారంభించడం నాకు సంతోషం కలిగిస్తుంది అని అన్నారు. 100% చేనేత, పట్టు వస్త్రాలు లభిస్తాయి అని అన్నారు. ఎగ్జిబిషన్ లో స్టాల్స్ సందర్శించి పట్టు చీరల నాణ్యతను గురించి తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ...... భారతదేశం నలుమూలల నుంచి సేకరించిన శుద్ధమైన సిల్క్ చీరలు, కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అని అన్నారు.ముఖ్యంగా బనారస్, పశ్చిమ బెంగాల్ బాటిక్ వస్త్రాలు, టస్సార్ కాటన్, ప్రింటెడ్ చీరలు, చెందేరి, మహేశ్వరి కాటన్, రాజ్కోటి, పటోలా వంటి అరుదైన వస్త్రాలు వినియోగదారులను నచ్చుతాయి అని అన్నారు.ఈ ఎగ్జిబిషన్ను డిసెంబర్ 20 నుండి 25 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ ప్రదర్శనలో సుమారు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయగా, పట్టుచీరలతో పాటు పట్టు దుపట్టాలు, డ్రెస్సు మెటీరియల్స్, ఫ్యాషన్ బ్లౌజ్ పీసులు కూడా అందుబాటులో ఉన్నాయి అని అన్నారు.ప్రతి వస్త్రానికి నాణ్యతకు హామీ ఇస్తూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విభిన్న ధరల్లో విక్రయాలు చేపడుతున్నారు అని అన్నారు.ఈ ఎగ్జిబిషన్లో కొనుగోలు చేసిన వస్త్రాలపై ప్రత్యేక రాయితీలు కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతి ఉంది. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి సంప్రదాయంతో పాటు ఆధునిక డిజైన్లను ఒకేచోట వీక్షించి కొనుగోలు చేయవచ్చని తెలిపారు.స్థానిక ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా సందర్శకులు తరలివస్తుండటంతో నెల్లూరులో ఈ ఇండియన్ సిల్క్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.











