
కొండాపురం,మన న్యూస్, డిసెంబర్ 17,(నాగరాజు కె).
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన పాత్రుడు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ జిల్లా టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి చెరుకూరి వెంకటాద్రి నాయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో బీద రవిచంద్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలములో కొండాపురం మండల టిడిపి అధ్యక్షుడిగాను, జిల్లా టిడిపి కార్యనిర్వాహ కార్యదర్శి గాను తాను పనిచేసినట్లు చెప్పారు.జిల్లా పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్న రవిచంద్ర ని పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.గతంలో కొండాపురం జడ్పీటీసీగా పనిచేసిన కాలము నుండి రవిచంద్ర కుటుంబముతో మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.అంతే కాకుండ రాజకీయాల్లో పరిణతీతో కూడిన నైతిక విలువలు కలిగిన నేతగా బీద రవిచంద్రను అభివర్ణించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రవిచంద్ర చేసిన కృషి అజరామరం అన్నారు. బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ జోన్ ఇంచార్జిగా, గతంలోనూ టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర తెలుగు యూవత అధ్యక్షులు గా విభిన్న హోదాలలో పదవులను అలంకరించి తెలుగుదేశం పార్టీకి మరింతగా వెన్ను తెచ్చిన మహా నేత అని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీనవర్గాల కు చెందిన బలమైన నేతగా ఉన్న బీద రవిచంద్ర యాదవ్ ను ఆయన పార్టీకి అందించిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీదర్ రవిచంద్ర ను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా నియమించడం పట్ల టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్లుందని చెరుకూరి వెంకటాద్రి అన్నారు