
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ మండలం ముస్లాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పవిత్ర నాగరాజు గార్ల కు మద్దతు పలుకుతూ, రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలితమ్మ ఇంటింటా ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పవిత్ర నాగరాజు గారిని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డంపల్లి హనుమంతు, మరియు గడ్డంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.