
చిత్తూరు డిసెంబర్ 13 మన ద్యాస
చిత్తూరు జిల్లా కేంద్రంలోని విద్య జూనియర్ కళాశాల చిత్తూరు నందు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన విద్య జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్.. కార్యక్రమాన్ని విద్య జూనియర్ కళాశాల యాజమాన్యం డాక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ సివిల్ జడ్జి భారతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘుపతి, సింధియా డైరెక్టర్ ఎన్జీవో అబ్రహం సంతానం, సీఐ మహేశ్వర్, సి.సి.ఎస్ ఉమామహేశ్వర్,క్రాస్ ఎన్జీవో భూపతి, జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి సహదేవ నాయుడు, పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని, అదే సమయంలో సమాంతరంగా మాదక ద్రవ్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం, నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం చిత్తూరు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ మాట్లాడుతూ నేటి యువత భావి భారత పౌరులని వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ తో పాటు గుట్కా, గంజాయి, మాదకద్రవ్యాలు, సిగరెట్, మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆలోచన విధానం, ఆలోచన శక్తి, నశిస్తాయన్నారు. అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ నేటి యువత మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కాకుండా సమాజంలో మంచి చెడు తెలుసుకోవాలని తెలియజేశారు. ప్రతినిత్యం విద్య పట్ల ఆసక్తి కలిగి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. అనంతరం విద్యా జూనియర్ కళాశాల యాజమాన్యం డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ నేటి యువతపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని తప్పుడు దారులలో వెళ్ళకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వలన భవిష్యత్తులో అతిపెద్ద సవాలు మాదకద్రవ్యాలని సైబర్ నేరాలు ఉంటాయని వీటిని నియంత్రించేందుకు ప్రజలు సహకారం అందించాలని ముఖ్యంగా యువత వీటిపై అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. అనంతరం అవార్డు సంస్థ ఎన్జీవో అధ్యక్షులు రవి, అలాగే మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప, ఈ కార్యక్రమంలో కళాకారుల బృందం చే మాదక ద్రవ్యాల ద్వారా కలిగే ప్రభావం పై నాటకాలు, పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.