
కావలి, నవంబర్ 27,మన ధ్యాస ప్రతినిది , (కె ఎన్ రాజు)://
స్వచ్చంద సంస్థల అధ్యక్షులు షేక్.బాష ఆధ్వర్యంలో శుక్రవారం ప్రముఖ ఆర్థో పెడిక్ వైద్య నిపుణులు, సౌమ్యులు,సేవా తత్పరులు,డాక్టర్ మంచికంటి రామస్వామి, కావలి (ఐ ఎం ఏ )ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు గ ఎన్నికయిన శుభ సందర్భముగ, కావలి లోని స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, మర్యాద పూర్వకముగ ఆత్మీయముగా కలుసుకొని, దుస్సాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు, శుభాభి నందనలు తెలియచేయడమైనది.వక్తలు ప్రసంగిస్తు,డాక్టర్ రామ స్వామి వైద్య రంగంలో రాణిస్తు సేవాభావంలో మంచి గుర్తింపు పొందు తున్నారని, ఇప్పటి నుండి కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగ కూడ రాణిస్తూ మరెన్నో సేవలు అందిస్తు, మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని అందరిమన్ననలు, అభిమానం పొందాలని ఆకాంక్షించారు.పై కార్యక్రమంలో మీకోసం సేవాసంస్థ రాయపాటి దిలీప్ కుమార్,వాయిస్ అఫ్ ముస్లిం మైనారిటీ,మొఘల్ సలీం బేగ్,రత్నమ్మ ఫౌండేషన్ ఎంవీ ప్రసాద్ రావు,ఆపద్భాందవ సేవా ట్రస్ట్ దామ మధుసూదన్ రావు,సంయుక్త సేవా సంస్థ సురేంద్ర, టైమ్ టు హెల్ప్ నంది పాటి రమేష్,హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ ఘని బాష, విశ్రాంత ఉప తాసీల్దార్ మొఘల్ శిరాజ్ బేగ్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎమ్.అజిత్ బాబు,విశ్రాంత లైబ్రేరీయన్ చెవూరు ప్రభయ్య,ఎమ్.నాగరాజు బాబ్జి,తదితరులు పాల్గొన్నారు