
🔸సమిష్టిగా పనిచేద్దాం… గ్రామ అభివృద్ధికి తోడ్పడదాం!
కలిగిరి నవంబర్ 21 మన ధ్యాస న్యూస్://

కలిగిరి మండల పరిధిలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలో తేడాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలనే పిలుపును ఆయన అందించారు. అభివృద్ధి పథంలో గ్రామాలు దూసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.శుక్రవారం నాడు కలిగిరి మండలంలోని ఏరుకులరెడ్డి పాలెం, పడమటి గుడ్లదోన, తూర్పు గుడ్లదోన మరియు పరికోట పంచాయతీలలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు కోసం జరిగిన సమావేశాలకు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమాల్లో ముందుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నిస్వార్థంగా పనిచేసిన బూత్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న నాయకులను ఎమ్మెల్యే స్వయంగా అభినందించారు.

వారి సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తదుపరి గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా—సోమశిల ఉత్తర కాలువ విస్తరించి మా పొలాలకు సాగునీరు అందించండని గ్రామస్తులు ఎమ్మెల్యే కి తెలియజేశారు.,భూసంబంధిత సమస్యలు,గ్రామంలో మౌలిక వసతుల లోపం,సీసీ రోడ్ల అవసరం,తాగునీటి సమస్య,విద్యుత్ సరఫరాలో అంతరాయాలు,వంటి విషయాలను గ్రామ ప్రజలు వివరించారు.వాటిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే కాకర్ల ఈ సమస్యల పరిష్కారానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు.అనంతరం టిడిపి మండల నాయకులు, గ్రామ నాయకుల సమక్షంలో ప్రతి పంచాయతీలో గ్రామ కమిటీలను సక్రమంగా ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.గ్రామ కమిటీ సమావేశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. శాలువాలు అర్పించి, పూలదండలతో సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.
