
మన ధ్యాస,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చామని సంపన్నులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరు పేట మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో శుక్రవారం మధ్యాహ్నం రెడ్డి ల్యాబ్స్ వారు అందచేసిన ఫిజియోధెరఫి, డెంటల్ యప్రిడియాట్రిక్ తదితర విభాగాలకు సంబంధించి 40 లక్షల విలువ చేసే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ....... ఇందుకూరు పేట ప్రభుత్వ హాస్పిటల్ కు అత్యాధునిక వైద్య పరికరాలు అందచేసిన రెడ్డి ల్యాబ్స్ సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి రెడ్డి ల్యాబ్స్ సంస్థ సహకరించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్యాన్సర్ పరీక్షల గురించి ప్రస్తావించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో విపిఆర్ నేత్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. ఉదయగిరి నుంచి ప్రారంభించి తదుపరి కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని అవసరమైతే కళ్ళకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. విపిఆర్ నేత్ర పేరిట నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీర ప్రాంతమైన మైపాడు పరిసర గ్రామాల మత్స్యకారుల వైద్య సేవల కోసం శిథిలావస్థకు చేరిన మైపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపి వేమిరెడ్డి గారి సహకారంతో 3 కోట్ల 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో త్వరలోనే ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఇందుకూరు పేట ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ జయలక్ష్మి, ఎమ్మార్వో గోపి కృష్ణ, ఎంపీడీవో నాగేంద్ర బాబు, ఇందుకూరుపేట సిహెచ్సి సూపర్ ఇండెంట్ సునీల్ కుమార్,ఇందుకూరు పేట టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావిళ్ళ వీరేందర్ నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, సూదలగుంట నాగార్జున తదితరులు పాల్గొన్నారు.






