
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా అన్నారు.కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ గుల్ గుస్తా వద్ద అతిథి గృహంలో జుక్కల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరూ డీసీసీ అధ్యక్ష పదవీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జు న్ కార్గే ,ఎంపీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాలను తీసుకొని పార్టీ పెద్దలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఏఐసీసీ వారికి పంపిస్తే వాళ్లే డిసిసి అధ్యక్షుని ఎన్నిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.తెలంగాణలోకి రావడం మొదటి సారి అని గుర్తు చేశారు.కార్యకర్తలు ఒక్కొక్కరు వచ్చి నాకు అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,దర్పల్ గంగాధర్,రమేష్ దేశాయి,రాజు పటేల్,ధరత్ సాయిలు,మహేందర్ రెడ్డి,హనుమాన్లు,కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గుప్తా,సీనియర్ నాయకులు బానపురం ప్రతాప్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గ యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రోస్,అనిస్ పటేల్, గుర్రపు శ్రీనివాస్,గజ్జల కిరణ్,ప్రజా పండరి,సంకు లక్ష్మయ్య, లోక్య నాయక్,అబ్దుల్ ఖాళీక్,గోపి సింగ్, బోయిని హరిన్,అజారుద్దీన్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.