
అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు హిందూ బంధువులు,మిత్రులు అభిమానులు
తిరుపతి,మన ధ్యాస ,అక్టోబర్ 12: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం వే ఫౌండేషన్ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగాయి. ఫౌండర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో భారతీయ హైందవ సంస్కృతి,సంప్రదాయాన్ని నేటి యువత కోసం ఆవిష్కరిస్తూ, నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు పాల్గొన్న ప్రముఖ అతిథులను, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి . ప్రతీ ప్రదర్శనకు సభికులు కరతాళ ధ్వనులతో మహతి మార్మోగింది.అనంతరం తెలుగు రాష్ట్రాల నుంచి వే ఫౌండేషన్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్ధంగా, సమాజ సేవకులను గుర్తించి పలువురికి వివిధ రకాల అవార్డులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ శక్తి పీఠాదీశ్వరి శ్రీ రమ్యానంద భారతీ స్వామిని మరియు ఏ. పి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి రావు,రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ రమేష్ నాథ్ తదితర ప్రముఖులు హాజరైనారు.సందర్భంగా రీచ్ గ్లోబల్ పౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ గారిచే టాక్ ఆఫ్ ది టౌన్ ఎడిటర్ , హిందూ విలేకరుల సమితి రాష్ట్ర అధ్యక్షులు మునిరామ్ రెడ్డి సమాజం పట్ల ,హిందూ ధర్మం కోసం చేస్తున్న సేవలకు గుర్తించి, ఘనంగా సన్మానం చేసి. లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ప్రదానం ,మెమెంటో అందజేసి ఆయన చేసి అభినందించారు.కార్యక్రమం అనంతరం కూడా గ్లోబల్ పౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ , ప్రత్యేకంగా కలిసి పోటో తీసుకున్న సందర్భంగా అనంతరం కూడా అభినందించారు.ఈ సందర్భంగా వే ఫౌండేషన్ లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు గ్రహీత మునిరామ్ రెడ్డి మాట్లాడుతూ వే ఫౌండేషన్ కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారని వారికి ప్రత్యేక ధన్వంవాదాలు తెలిపారు.అదే విధంగా మన రీచ్ గ్లోబల్ పౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ గారు తిరుచానూరు నక్కల కాలనీ దత్తత కోవడం చాలా అభినందనీయమని వారికి వారే సాటి అని అన్నారు.ఈ రోజు ఇంత గొప్ప వ్యక్తులు చేత అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని , శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో,నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంతో, దేశం కోసం ధర్మం కోసం నిలబడే నేను. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని అన్నారు.అనంతరం మునిరామ్ రెడ్డి ని పలువురు కలిసి, మీరు చేస్తున్న సేవలకు నేడు నిజమైన గుర్తింపు,గౌరవం లభించిందని ,హిందూ బంధువులు,మిత్రులు, కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రంలోని పలువురు వివిధ రంగాల ప్రముఖులు,మీడియా సంస్థలు,వే ఫౌండేషన్ ప్రతినిధులు ,కళాకారులు,విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
