
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సేవాభావం వలన ఎన్నో కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందుతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 27 మంది లబ్ధిదారుల కుటుంబాలకు 21,28,470 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను ఎమ్మెల్యే సత్య ప్రభ అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఈ నిధి ద్వారా జీవనాధారంగా సహాయం అందిస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం, సంతోషం కోసం కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కమిటీ మెంబర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెన్న ఈశ్వరుడు (శివ) తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్ది రామారావు, బద్ది రమణ, వజ్రకూటం మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్, కత్తిపూడి మాజీ ఎంపీటీసీ సభ్యులు సాధనాల లక్ష్మీ బాబు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.