మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని చెక్కులను ,అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..ప్రజా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ లో కొత్త రికార్డు సృష్టించిందని అన్నారు.ఏడాదిలోనే 830 కోట్ల రూపాయల సాయం అందించామని,1.66 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరిందని అని అన్నారు.13 వేల మందికి 240 కోట్ల విలువ చేసే ఎల్వోసీలు మంజూరు చేశామని తెలిపారు.దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు.అనంతరం జుక్కల్ మండలంలోని మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులున్నారు.